విశాఖపట్నంలోని కైలాసగిరిపై సైన్స్ & టెక్నాలజీ మ్యూజియం ఏర్పాటు చేయనున్నారు
ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నానికి సైన్స్ అండ్ టెక్నాలజీ మ్యూజియం ఆమోదించబడింది మరియు ఇది కైలాసగిరిపై ఉంటుంది. కేంద్ర సాంస్కృతిక శాఖ నిధుల సహకారంతో వివిధ నగరాల్లో సైన్స్ అండ్ టెక్నాలజీ మ్యూజియంలను ప్లాన్ చేస్తున్న ఆంధ్రప్రదేశ్ సైన్స్ సిటీ విభాగం ఆధ్వర్యంలో ఈ మ్యూజియం నెలకొల్పడానికి గత ఆరు నెలలుగా ప్రయత్నాలు కొనసాగుతున్నాయి.
విశాఖలో ఎకరా విస్తీర్ణంలో ఈ మ్యూజియం ఏర్పాటుకు ఏపీ సైన్స్ సిటీ అధికారులు ముందుకు వచ్చారు. మొదట్లో కైలాసగిరిపై ప్లానిటోరియంగా ప్రతిపాదించినా ఆ ఆలోచన కార్యరూపం దాల్చకపోగా, ఆ తర్వాత సైన్స్ అండ్ టెక్నాలజీ మ్యూజియం కోసం అవసరమైన భూమిని కేటాయించారు. సమగ్ర ప్రాజెక్టు నివేదికను వెంటనే తయారు చేసి ఢిల్లీకి పంపించి, ప్రాజెక్టు కోసం కోరిన మొత్తం రూ.5 కోట్లతో ప్రతిపాదనలు పంపగా కేంద్రం రూ.4.69 కోట్లకు ఆమోదం తెలిపింది. అందులో రూ.3,75,20,000 గ్రాంట్ ఇన్ ఎయిడ్గా మంజూరుచేసింది.
కైలాసగిరిలోని సైన్స్ అండ్ టెక్నాలజీ మ్యూజియంలో 3డి ఆర్ట్ గ్యాలరీ, ఆగ్మెంటెడ్ రియాలిటీ ఎగ్జిబిట్లు, సిలికా విగ్రహాలు ఉంటాయి. మేఘాల ఏర్పాటు మరియు పవన విద్యుత్ ఉత్పత్తి వంటి సైన్స్ మరియు టెక్నాలజీకి సంబంధించిన వివిధ ఆకర్షణీయమైన అంశాలపై పిల్లలకు మరియు సందర్శకులకు అర్థమయ్యేలా ప్రదర్శనలు నిర్వహిస్తారు. భవిష్యత్ తరాలకు ఈ భావనలపై మంచి అవగాహన ఉండేలా ప్రదర్శనలు నిర్వహించబడతాయి. ప్రాజెక్ట్ నిర్మాణ బాధ్యతను AP సైన్స్ సిటీ చేపడుతుంది మరియు మొదటి ఐదేళ్లపాటు మ్యూజియాన్ని వారు నిర్వహిస్తారు.
ఈ నిధులకు అదనంగా మరో కోటి రూపాయలు ఇవ్వడానికి ఇస్రో ముందుకు వచ్చిందని వీఎంఆర్డీఏ వర్గాలు తెలిపాయి. మ్తొతం ఆరు కోట్ల రూపాయలతో నిర్మాణం జరుగుతుంది. తొలి ఐదేళ్లు ఏపీ సైన్స్ సిటీ ప్రతినిధులే దీనిని నిర్వహిస్తారు. సందర్శకుల నుంచి ప్రవేశరుసుము వసూలు చేస్తారు. అందులో 50 శాతం సైన్స్ సిటీ తీసుకొని మిగిలిన 50 శాతం వీఎంఆర్డీఏకి ఇస్తుంది. ఐదేళ్ల తరువాత ప్రాజెక్టు మొత్తం వీఎంఆర్డీఏకి అప్పగిస్తారు. త్వరలోనే పనులు ప్రారంభిస్తామని ఏపీ సైన్స్ సిటీ సీఈఓ జయరామిరెడ్డి తెలిపారు.
మరింత చదవండి: | |
తాజా ఉద్యోగ ప్రకటనలు | ఇక్కడ క్లిక్ చేయండి |
ఉచిత స్టడీ మెటీరియల్ (APPSC, TSPSC) | ఇక్కడ క్లిక్ చేయండి |
ఉచిత మాక్ టెస్టులు | ఇక్కడ క్లిక్ చేయండి |
***************************************************************************