Telugu govt jobs   »   Current Affairs   »   Andhra Pradesh Ranks First In Digital...

Andhra Pradesh Ranks First In Digital Payments | డిజిటల్ చెల్లింపుల్లో ఆంధ్రప్రదేశ్ మొదటి స్థానంలో ఉంది

Andhra Pradesh Ranks First In Digital Payments | డిజిటల్ చెల్లింపుల్లో ఆంధ్రప్రదేశ్ మొదటి స్థానంలో ఉంది

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) పరిశోధన నివేదిక ప్రకారం భారతదేశంలోని టాప్ 15 రాష్ట్రాలు డిజిటల్ చెల్లింపుల విలువ మరియు పరిమాణంలో 90% వాటాను కలిగి ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ మొదటి స్థానంలో ఉండగా, మహారాష్ట్ర, తెలంగాణ, కర్ణాటక తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. ఈ రాష్ట్రాల్లో సగటు డిజిటల్ చెల్లింపు మొత్తం ₹2,000 మరియు ₹2,200 మధ్య ఉంది.

ఏపీ, మహారాష్ట్ర, తెలంగాణ, కర్ణాటక తర్వాత ఉత్తరప్రదేశ్‌, రాజస్థాన్‌, తమిళనాడు, బీహార్‌, పశ్చిమ బెంగాల్‌లలో డిజిటల్‌ చెల్లింపులు ఎక్కువగా జరుగుతున్నాయి. ఈ రాష్ట్రాల్లో సగటు డిజిటల్ చెల్లింపులు ₹1,800 నుండి ₹2,000 వరకు ఉన్నాయి. వీటి తర్వాత ఒడిశా, కేరళ, మధ్యప్రదేశ్, గుజరాత్, అస్సాం మరియు హరియాణాల్లో డిజిటల్ చెల్లింపుల మొత్తం ₹1,600 మరియు ₹1,800 మధ్య ఉన్నట్లు నివేదిక వెల్లడించింది.

డిజిటల్ చెల్లింపుల్లో అగ్రగామిగా ఉన్న ఆంధ్రప్రదేశ్ మొత్తం 8-12% వాటాను కలిగి ఉందని నివేదిక పేర్కొంది. భారతదేశంలోని మొదటి 100 జిల్లాలు జిల్లాలవారీగా UPI డిజిటల్ చెల్లింపుల పరిమాణం మరియు విలువలో 45% వాటాను కలిగి ఉన్నట్లు తేలింది.

దేశ జీడీపీలో 2017లో ఏటీఎంల నుంచి 15.4 శాతం నగదు ఉపసంహరణలు జరగ్గా, ఇది 2023లో 12.1%కి తగ్గింది. 2017లో, ఒక వ్యక్తి సంవత్సరానికి 16 సార్లు ATMకి వెళ్ళగా,  2023లో ఇది 8 సార్లుకు పడిపోయింది.

రూ.2,000 నోట్ల ఉపసంహరణ UPI చెల్లింపులపై ఎలాంటి ప్రభావం చూపలేదని నివేదిక కనుగొంది. ఏప్రిల్ 2023లో 414 బ్యాంకుల్లో UPI ద్వారా 890 కోట్ల ఆర్థిక లావాదేవీలు జరిగాయి. ఈ లావాదేవీల మొత్తం విలువ ₹14.1 లక్షల కోట్లు. దీన్నిబట్టి నగదు రహిత ఆర్థిక వ్యవస్థ దిశగా దేశం ముందుకు వెళ్తున్నట్టు స్పష్టమవుతోందని పేర్కొంది. డిజిటల్ చెల్లింపులు మెట్రో నగరాలకే పరిమితం కాలేదని, గ్రామీణ మరియు సెమీ అర్బన్ ప్రాంతాల్లో కూడా 60% వాటాను కలిగి ఉన్నాయని నివేదిక వెల్లడించింది.

2016లో ప్రారంభించబడిన యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్‌ఫేస్ (UPI), భారతదేశంలో అత్యంత ప్రజాదరణ పొందిన డిజిటల్ చెల్లింపు పద్ధతిగా మారింది. మొత్తం డిజిటల్ చెల్లింపులు 2016లో దేశ జీడీపీలో 668 శాతం ఉండగా 2023 నాటికి 767 శాతానికి పెరిగాయి. రిటైల్ డిజిటల్ చెల్లింపులు (ఆర్డీఎస్ మినహా) 2016లో దేశ జీడీపీలో 129 శాతం ఉండగా 2023 లో 242 శాతానికి పెరిగాయి.

దేశంలో వ్యక్తి నుండి వ్యక్తికి మరియు వ్యక్తి నుండి వ్యాపారికి మొత్తం డిజిటల్ చెల్లింపులలో UPI వాటా 73% అని నివేదిక కనుగొంది.

UPI లావాదేవీల పరిమాణం 2017లో 1.8 కోట్ల నుండి 2023 నాటికి 8,375 కోట్లకు పెరిగింది. అదే సమయంలో, UPI లావాదేవీల విలువ ₹6,947 కోట్ల నుండి ₹139 లక్షల కోట్లకు పెరిగింది. ఇది 2004 రెట్లు పెరుగుదల.

AP and TS Mega Pack (Validity 12 Months)

మరింత చదవండి
తాజా ఉద్యోగ ప్రకటనలు  క్కడ క్లిక్ చేయండి
ఉచిత స్టడీ మెటీరియల్ (APPSC, TSPSC) ఇక్కడ క్లిక్ చేయండి
ఉచిత మాక్ టెస్టులు  ఇక్కడ క్లిక్ చేయండి

Sharing is caring!

FAQs

UPIని ఎవరు కనుగొన్నారు?

యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్‌ఫేస్ (UPI)ని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) మరియు ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ (IBA) స్థాపించిన నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) అభివృద్ధి చేసింది.