తణుకులోని ఆంధ్రా షుగర్స్కు జాతీయ స్థాయిలో గుర్తింపు లభించింది
పశ్చిమగోదావరి జిల్లా తణుకులో ఉన్న ఆంధ్రా షుగర్స్ సంస్థ ఘన విజయం సాధించి జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకుంది. ఆంధ్రా షుగర్స్ అనే సంస్థ, చెరకు కోసం ప్రత్యేకంగా రూపొందించిన హార్వెస్టింగ్ మెషిన్ అనే అద్భుతమైన ఆవిష్కరణకు 20 ఏళ్ల పేటెంట్ని విజయవంతంగా పొందింది.
జూలై 26న, భారత ప్రభుత్వ పేటెంట్ కార్యాలయం ఈ అద్భుతమైన ఆవిష్కరణకు తగిన అర్హత కలిగిన పేటెంట్ సర్టిఫికేట్ను జారీ చేసింది. ఆంధ్రా షుగర్స్లో కంపెనీ జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ ముళ్లపూడి నరేంద్రనాథ్ మార్గదర్శకత్వంలో సంస్థకు చెందిన షుగర్ కేన్ హార్వెస్టర్ డెవలప్మెంట్ టీమ్ దీన్ని నిర్మించడానికి, ఉపయోగించడానికి పదేళ్లుగా అంకిత భావంతో కృషి చేశారు. భారతీయ వ్యవసాయ పరిస్థితులకు అనువైన చెరకు హార్వెస్టర్ ఆవిష్కరణకు పేటెంట్ మంజూరు అయిన దేశంలోనే మొట్టమొదటి సంస్థ ఆంధ్రా షుగర్స్ కావడం విశేషం.
మరింత చదవండి: | |
తాజా ఉద్యోగ ప్రకటనలు | ఇక్కడ క్లిక్ చేయండి |
ఉచిత స్టడీ మెటీరియల్ (APPSC, TSPSC) | ఇక్కడ క్లిక్ చేయండి |
ఉచిత మాక్ టెస్టులు | ఇక్కడ క్లిక్ చేయండి |
***************************************************************************