Telugu govt jobs   »   Current Affairs   »   AP Athletes Secured two Medals in...

AP Athletes Secured two Medals in National Games | జాతీయ క్రీడలలో ఆంధ్రప్రదేశ్ కు చెందిన క్రీడాకారులు రెండు పతకాలు సాధించారు

AP Athletes Secured two Medals in National Games | జాతీయ క్రీడలలో ఆంధ్రప్రదేశ్ కు చెందిన క్రీడాకారులు రెండు పతకాలు సాధించారు
గోవాలో జరుగుతున్న జాతీయ క్రీడలలో మంగళవారం ఆంధ్రప్రదేశ్ క్రీడాకారులు రెండు పతకాలు గెలుచుకున్నారు. మహిళల 4*100 మీటర్ల రిలే ఫైనల్లో APకి చెందిన మధుకావ్య, ప్రత్యూష, భవానీ, జ్యోతి యర్రాజి విజయం సాధించి బంగారు పతాకం పొందారు. అలాగే మహిళల జావెలిన్ త్రో విభాగంలో రశ్మి శెట్టి కాంస్యం సాధించిది. ఈ రెండు పతకాలు కలుపుకుని ఇప్పటివరకు ఆంధ్రప్రదేశ్ కు మొత్తం 13 పతకాలు వచ్చాయి అందులో 4 బంగారం, 2 కాంస్యం, 7 రజతం ఉన్నాయి. పట్టికలో ఆంధ్రప్రదేశ్ 16వ స్థానం లో ఉంది.

Sharing is caring!