అరకు కాఫీ భారతదేశపు గిరిజన కాఫీ బ్రాండ్గా ప్రపంచ ఖ్యాతిని మరియు ప్రశంసలు పొందుతోంది
అరకు కాఫీ ఘుమఘుమలు అంతర్జాతీయ ట్విటర్ వేదికగా విశేష చర్చనీయాంశంగా మారి మరొక సారి ప్రపంచ స్థాయి గుర్తింపు తెచ్చుకుంది. ప్రపంచంలోనే తొలి గిరిజన సంప్రదాయ కాపీ అయిన అరకు కాఫీ ఇండియన్ గ్రేట్ బ్రాండ్లలో ఒకటి అంటూ నీతి ఆయోగ్ మాజీ సీఈవో అమితాబ్ కాంత్ ట్వీట్ చేయగా దానిని స్వాగతిస్తూ మహీంద్రా గ్రూప్ చైర్మన్ ఆనంద్ మహీంద్రా రీట్వీట్ చేశారు. దీంతో మరొక సారి అంతర్జాతీయంగా అరకు కాఫీపై ట్విట్టర్ వేదికగా పెద్ద చర్చ జరుగుతోంది. ముఖ్యంగా, భారతదేశంలో జరిగిన G-20 సమావేశాలలో విదేశీ ప్రతినిధులకు ఈ అద్భుతమైన కాఫీ అందించబడింది.
అమితాబ్ కాంత్ అరకు కాఫీని సేంద్రియ సాగు పరీక్షలలో 90 కంటే ఎక్కువ మార్కులను నిలకడగా సాధించి, భారతీయ ప్రధాన కాఫీగా దాని స్థానాన్ని పదిలపరుచుకున్నందుకు ప్రశంసించారు. ఇది ఒక ప్రసిద్ధ బ్రాండ్గా పరిణామం చెందడమే కాకుండా గిరిజన వర్గాల జీవితాలపై సానుకూల ప్రభావం చూపి, వారి పురోగతికి తోడ్పడుతుంది.