CM to Inaugurate Ambedkar Statue in Swaraj maidan, Vijayawada | విజయవాడ స్వరాజ్ మైదానంలో అంబేడ్కర్ విగ్రహాన్ని ప్రారంభించనున్న సీఎం
విజయవాడ లో స్వరాజ్ మైదానంలో నగరానికే తలమానికం కానున్న 125 అడుగుల అంబెడ్కర్ విగ్రహాన్ని ముఖ్యమంత్రి ఈ నవంబర్ 26వ తేదీన ఆవిష్కరించనున్నారు. రూ.400 కోట్లతో ఈ విగ్రహ నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. నవంబర్ 26వ తేదీ రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా ఈ విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు. నిర్మాణ పనులను సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి నాగార్జునతో కూడిన 8మంది బృందం సమీక్షిస్తున్నారు. ఢిల్లీ నుంచి వచ్చిన బృందం అత్యాధునిక టెక్నాలజీ ఉపయోగించి నిర్మాణ పనులు చేపట్టారు. అంబెడ్కర్ విగ్రహంతో పాటు జీవిత చరిత్ర తెలిపే డిజిటల్ మ్యూజియం, 1500 మంది కూర్చోగలిగే కన్వెన్షన్ సెంటర్, మినీ థియేటర్, ఫుడ్ కోర్టు, పార్కింగ్ వంటి అనేక మౌలిక సదుపాయాలు కల్పించనున్నారు. గ్రౌండ్, ఫస్ట్, సెకండ్ ఫ్లోర్ లలో వివిధ సౌకర్యాలు కల్పించారు. కింద బేస్ తో కలిపి మొత్తం విగ్రహం ఎత్తు 206 అడుగులు. ఈ స్మృతి వనంలో దాదాపు 3కి.మీ మేర సైక్లింగ్ ట్రాక్ కూడా నిర్మించారు.
మరింత చదవండి | |
తాజా ఉద్యోగ ప్రకటనలు | ఇక్కడ క్లిక్ చేయండి |
ఉచిత స్టడీ మెటీరియల్ (APPSC, TSPSC) | ఇక్కడ క్లిక్ చేయండి |
ఉచిత మాక్ టెస్టులు | ఇక్కడ క్లిక్ చేయండి |
Adda247 తెలుగు APP | ఇక్కడ క్లిక్ చేయండి |