Daikin’s 3rd AC Manufacturing unit is setup in Sricity, Andhra Pradesh | డైకిన్ 3వ ఏసీ తయారీ యూనిట్ ఆంధ్రప్రదేశ్ శ్రీసిటీలో ప్రారంభించబడింది
జపాన్ కు చెందిన డైకిన్ సంస్థ ఆంధ్రప్రదేశ్ లో ఏసి లు తయారుచేసే కర్మాగారం శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా, శ్రీ సిటీ లో ఈ నెల 23న అధికారికంగా ప్రారంభించనున్నారు. కేయవలం 18 నెలల్లో తయారీ యూనిట్ను ఏర్పాటు చేశారు దీని ద్వారా సుమారు 3000 మందికి ఉపాధి లభిస్తుంది. సుమారు రూ.1000 కోట్లతో 75.5 ఎకరాలలో ఈ పరిశ్రమ యూనిట్ ను స్థాపించారు. APSSDCL తో ఒప్పందం కుదుర్చుకుని 2020-21లో డిప్లొమా పూర్తిచేసిన విధ్యార్ధులకు శిక్షణ ఇచ్చి ఉపాధి కల్పించారు వారికి సుమారు రూ.2లక్షల వరకు వార్షిక వేతనం అందించనున్నారు. శ్రీసిటీ లో ఏర్పాటు చేసిన ఈ యూనిట్ భారతదేశంలోనే 3 యూనిట్ మొదటి రెండు జైపూర్, నీమ్రాణా రాజస్థాన్ లో ఏర్పాటు చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే రూ. 3755 కోట్లు ఏసిల తయారీ రంగంలో బ్లూస్టార్, లాయిడ్, పానాసోనిక్ వంటి ప్రముఖ కంపెనీలు పెట్టుబడులు పెట్టాయి వీటిద్వారా ఏసి తయారీ హబ్ గా ఆంధ్రరాష్ట్రం నిలవనుంది.
మరింత చదవండి | |
తాజా ఉద్యోగ ప్రకటనలు | ఇక్కడ క్లిక్ చేయండి |
ఉచిత స్టడీ మెటీరియల్ (APPSC, TSPSC) | ఇక్కడ క్లిక్ చేయండి |
ఉచిత మాక్ టెస్టులు | ఇక్కడ క్లిక్ చేయండి |
Adda247 తెలుగు APP | ఇక్కడ క్లిక్ చేయండి |