ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్ నియమితులయ్యారు
ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకుర్ నియమితులయ్యారు. ఈ నెల 5న సుప్రీంకోర్టు కొలీజియం చేసిన సిఫార్సులను రాష్ట్రపతి ఆమోదించగా, జూలై 24న కేంద్ర న్యాయశాఖ సంబంధిత ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్రపతి ద్రౌపదీముర్ము ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ న్ను సంప్రదించి ఈ నియామకానికి ఆమోదముద్ర వేసినట్లు కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ ట్విటర్లో పేర్కొన్నారు.
జస్టిస్ దీరజ్సింగ్ రాకుర్ సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి, జస్టిస్ టీఎస్ ఠాకుర్గా సుపరిచితులైన జస్టిస్ తీరథ్సింగ్ రాకుర్ తమ్ముడు. వారి తండ్రి దేవీదాస్ రాకుర్ ప్రధానోపాధ్యాయుడిగా వృత్తి జీవితం ప్రారంభించి, హైకోర్టు న్యాయమూర్తిగా, రాష్ట్ర మంత్రిగా, ఉపముఖ్యమంత్రిగా, సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాదిగా మరియు గవర్నర్గా ఎదిగిన ప్రముఖ వృత్తిని కలిగి ఉన్నారు.
1964 ఏప్రిల్ 25న జన్మించిన జస్టిస్ దీరజ్సింగ్ ఠాకుర్ మాతృరాష్ట్రం జమ్మూకశ్మీర్. 1989 అక్టోబర్ 18న దిల్లీ జమ్మూకశ్మీర్ బార్ కౌన్సిల్లో న్యాయవాదిగా పేరు నమోదుచేసుకున్నారు. 2011లో సీనియర్ అడ్వొకేట్ గా పదోన్నతి పొందారు. 2013 మార్చి 8న జమ్మూకశ్మీర్ హైకోర్టు న్యాయమూర్తిగా నియమితులయ్యారు.
ఏపీ హైకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రాను సుప్రీంకోర్టుకు పదోన్నతి కల్పించడంతో మే 19న ఖాళీ అయిన సీటును భర్తీ చేసేందుకు జస్టిస్ ధీరజ్ సింగ్ పేరును కొలీజియం సిఫార్సు చేసింది. జస్టిస్ ధీరజ్ సింగ్ జమ్మూ మరియు కాశ్మీర్ హైకోర్టులో అత్యంత సీనియర్ న్యాయమూర్తి మరియు జూన్ 10, 2022న బొంబాయి హైకోర్టుకు బదిలీ చేయబడ్డారు, ప్రస్తుతం అక్కడ పనిచేస్తున్నారు.
గత ఫిబ్రవరి 9న కొలీజియం ఆయనను మణిపూర్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా బదిలీ చేయాలని సిఫారసు చేసింది. అయితే ఆ సిఫార్సు ప్రభుత్వం వద్ద పెండింగ్లో ఉండడంతో కొలీజియం దానిని రద్దు చేసి, ఈ నెల 5న ఆయన్ను ఏపీ హైకోర్టు సీజేగా నియమించాలని నిర్ణయించింది.
మరింత చదవండి: | |
తాజా ఉద్యోగ ప్రకటనలు | ఇక్కడ క్లిక్ చేయండి |
ఉచిత స్టడీ మెటీరియల్ (APPSC, TSPSC) | ఇక్కడ క్లిక్ చేయండి |
ఉచిత మాక్ టెస్టులు | ఇక్కడ క్లిక్ చేయండి |