నావిగేషన్ యాప్ ‘Waze’ కి CEOగా నేహా పారిఖ్ నియామకం
భారతీయ-అమెరికన్, నేహా పరిఖ్, క్రౌడ్ సోర్స్డ్ GPS నావిగేషన్ యాప్ మరియు టెక్ దిగ్గజం గూగుల్ యొక్క అనుబంధ సంస్థ అయిన Waze యొక్క సి.ఇ.ఒ గా నియమితులయ్యారు. ఇజ్రాయెల్ కంపెనీని 12 సంవత్సరాలు నాయకత్వం వహించిన తరువాత, 2020 నవంబర్లో సిఇఒ పదవి నుంచి వైదొలిగిన నోమ్ బార్డిన్ స్థానంలో 41 ఏళ్ల నేహా బాధ్యతలు చేపడుతన్నారు. Waze అనువర్తనం 56 వేర్వేరు భాషలలో ఆదేశాలను ఇవ్వగలదు. ఈ అనువర్తనం 2008 లో ఇజ్రాయెల్లో స్థాపించబడింది. దీనిని గూగుల్ 2013 లో 1.1 బిలియన్ డాలర్లకు (110 కోట్లు) కొనుగోలు చేసింది.
ఆన్లైన్ లైవ్ క్లాస్సుల వివరాల కొరకు ఇక్కడ క్లిక్ చేయండి
adda247 APP ను డౌన్లోడ్ చేసుకోడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి