కచ్లో భారతదేశపు అతిపెద్ద సౌర విద్యుత్ పార్కును నిర్మించనున్న NTPC
భారతదేశపు అతిపెద్ద విద్యుత్ జనరేటర్ అయిన NTPC లిమిటెడ్, గుజరాత్ లోని ఖవాడాలోని రాన్ ఆఫ్ కచ్ ప్రాంతంలో దేశం యొక్క ఏకైక అతిపెద్ద సౌర కాంతివిపీడన ప్రాజెక్టు(solar photovoltaic project)ను నిర్మించడానికి సిద్ధంగా ఉంది. సోలార్ పవర్ పార్క్ 4.75 గిగావాట్ (Gw) / 4750 మెగావాట్ల సామర్ధ్యం కలిగి ఉంటుంది. NTPC’s renewable energy arm, NTPC Renewable Energy (NTPC-REL) ద్వారా ఈ ప్రాజెక్ట్ నిర్మించబడుతుంది.
ఆన్లైన్ లైవ్ క్లాసుల వివరాల కొరకు ఇక్కడ క్లిక్ చేయండి
ప్రాజెక్ట్ గురించి:
- NTPC యొక్క 100% అనుబంధ సంస్థ అయిన NTPC REL 2021 జూలై 12 న సౌర పార్క్ పథకం యొక్క మోడ్ 8 (అల్ట్రా మెగా రెన్యూవబుల్ ఎనర్జీ పవర్ పార్క్) కింద కొత్త మరియు పునరుత్పాదక ఇంధన మంత్రిత్వ శాఖ (MNRE) నుండి అనుమతి పొందింది.
- ఈ ప్రాజెక్ట్ గ్రీన్ ఎనర్జీ మేజర్గా మార్చడం NTPC ప్రణాళికలో ఒక భాగం. 2032 నాటికి 60 GW రెన్యూవబుల్ ఎనర్జీ కెపాసిటీని నిర్మించాలని లక్ష్యంగా పెట్టుకుంది.
- ఈ పార్క్ నుండి వాణిజ్య స్థాయిలో ఆకుపచ్చ హైడ్రోజన్ను ఉత్పత్తి చేయాలని NTPC REL యోచిస్తోంది. పునరుత్పాదక వనరుల నుండి ఉత్పత్తి చేయబడిన హైడ్రోజన్ను గ్రీన్ హైడ్రోజన్ అంటారు.
adda247 APP ను డౌన్లోడ్ చేసుకోడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి
అన్ని పోటీ పరీక్షలకు ముఖ్యమైన అంశాలు:
- NTPC చైర్మన్ మరియు మేనేజింగ్ డైరెక్టర్: శ్రీ గురుదీప్ సింగ్;
- NTPC స్థాపించబడింది: 1975.
- NTPC ప్రధాన కార్యాలయం: న్యూ ఢిల్లీ, ఇండియా