2023 జులై-సెప్టెంబర్ త్రైమాసికంలో పెళ్లయిన 10,511 జంటలకు వారి బ్యాంకు ఖాతాల్లో ‘వైఎస్ఆర్ కళ్యాణమస్తు’, ‘వైఎస్ఆర్ షాదీ తోఫా’ పధకాల కింద రూ.81.64 కోట్లను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తన క్యాంప్ కార్యాలయం లో లబ్దిదారులకి విడుదల చేశారు.
వైఎస్ఆర్ కళ్యాణమస్తు, వైఎస్ఆర్ షాదీ తోఫా ఈ రెండు పధకాల ద్వారా ఎస్సీ, ఎస్టీ, బీసీ, వికలాంగులు, భవన నిర్మాణ కార్మికుల కుటుంబాలకు చెందిన పదవ తరగతి పూర్తయిన బాలికలకు వారి వివాహం నిమిత్తం రాష్ట్ర ప్రభుత్వం ఆర్ధిక సహాయం అందిస్తోంది. మైనారిటీ వర్గాల బాలికలు. బాల్య వివాహాలను నిరోధించేందుకు వధూవరులు పదో తరగతి ఉత్తీర్ణులై 18 ఏళ్లు, 21 ఏళ్లు పూర్తి అవ్వాలి అని కఠిన నిర్ణయం చేసింది.
ఈ పధకం ద్వారా మైనారిటీలకు లక్ష రూపాయలు, దివ్యాంగులకు 1.50 లక్ష రూపాయలు, SC మరియు STలకు లక్ష రూపాయలు, BCలకు 50వేలు, SC/ST కులాంతర వివాహాలకు 1.20 లక్షలు అందజేస్తున్నారు. 2022 నుంచి ఇప్పటివరకు నాలుగు విడతలలో 46,062 మందికి 349 కోట్లు అందించారు.
Read More: | |
తెలుగులో వారపు కరెంట్ అఫైర్స్ 2023 | నెలవారీ కరెంట్ అఫైర్స్ 2023 తెలుగులో |
తెలుగులో డైలీ కరెంట్ అఫైర్స్ 2023 | స్టడీ మెటీరియల్ |
మరింత చదవండి | |
తాజా ఉద్యోగ ప్రకటనలు | ఇక్కడ క్లిక్ చేయండి |
ఉచిత స్టడీ మెటీరియల్ (APPSC, TSPSC) | ఇక్కడ క్లిక్ చేయండి |
ఉచిత మాక్ టెస్టులు | ఇక్కడ క్లిక్ చేయండి |
Adda247 తెలుగు APP | ఇక్కడ క్లిక్ చేయండి |