నారాయణపేటలో వ్యవసాయ పాలిటెక్నిక్ను ప్రారంభించనున్న తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం
తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం విద్యా మండలి నారాయణపేట జిల్లా కేంద్రంలో 2023-24 విద్యా సంవత్సరానికి వ్యవసాయ పాలిటెక్నిక్ను ఆమోదించింది. ఇది 2023-24 విద్యా సంవత్సరం నుండి 40 సీట్లను అందిస్తుంది. ఈమేరకు విశ్వవిద్యాలయ ఆడిటోరియంలో జూలై 25 న జరిగిన సమావేశానికి ఇన్చార్జి ఉప కులపతి రఘునందన్ రావు అధ్యక్షత వహించారు. డిప్లొమా, డిగ్రీ, పీజీ కోర్సులకు సంబంధించిన పలు అంశాలపై చర్చించిన సమావేశంలో రిజిస్ట్రార్ వెంకటరమణ, ఇతర అధికారులు కూడా పాల్గొన్నారు.
కేంద్ర ప్రభుత్వ విత్తనాభివృద్ధి సంస్థలో సహాయ సంచాలకుడు వనం అవినాష్ తన పేరిట బంగారు పతకం అందజేయాలని కోరుతూ రూ.4 లక్షల సాయం అందించేందుకు ముందుకొచ్చారు. దీనికి విద్యామండలి ఆమోదం తెలిపింది. ఈ మొత్తం నుండి వచ్చే వడ్డీ వరంగల్ వ్యవసాయ కళాశాలలో B.Sc (ఆనర్స్) కోర్సులో అత్యధిక గ్రేడ్ పాయింట్ సాధించిన విద్యార్థికి పతకాన్ని అందించడానికి ఉపయోగించబడుతుంది. ఈ ప్రతిష్టాత్మకమైన బంగారు పతకాన్ని ఏటా యూనివర్సిటీ వ్యవస్థాపక దినోత్సవం రోజున అందజేస్తారు.
మరింత చదవండి |
|
తాజా ఉద్యోగ ప్రకటనలు | ఇక్కడ క్లిక్ చేయండి |
ఉచిత స్టడీ మెటీరియల్ (APPSC, TSPSC) | ఇక్కడ క్లిక్ చేయండి |
ఉచిత మాక్ టెస్టులు | ఇక్కడ క్లిక్ చేయండి |