The countdown has begun! With only a few days left for the Telangana High Court Exam scheduled from 15th to 20th April 2025, it’s time to make every moment count. Whether you’re aiming for a technical role or a non-technical post, effective revision can be your key to success. To make your last-minute preparation effortless and efficient, we’ve carefully curated a set of important Multiple Choice Questions (MCQs) with detailed answers, designed specifically for a quick yet thorough revision. Go through these questions, refresh your knowledge, and walk into the examination hall with confidence!
Quick Revision Practice Questions:
Q1. దక్షిణ భారతదేశంలో మొట్ట మొదటి అమూల్ డైరీ ప్లాంట్ ఏ రాష్ట్రంలో ఏర్పాటు చేశారు?
(a) తమిళనాడు
(b) కేరళా
(c) ఆంధ్రప్రదేశ్
(d) తెలంగాణా
Q2. జాతీయ స్థాయిలో అత్యధిక తలసరి ఆదాయం కలిగిన రాష్ట్రం ఏది?
(a) తమిళనాడు
(b) ఢిల్లీ
(c) హర్యానా
(d) తెలంగాణా
Q3. ఇటివల కేంద్రం విడుదల చేసిన ఆరోగ్య సూచిలో తెలంగాణా రాష్ట్రం ఎన్నవ స్థానంలో ఉన్నది?
(a) 4 వ స్థానం
(b) 3 వ స్థానం
(c) 1 వ స్థానం
(d) 5 వ స్థానం
Q4. క్రింది వానిలో సైన్సు సిటీ లేని నగరాలను గుర్తించండి.
(a) హైదరాబాద్
(b) లక్నో
(c) గుహవటి
(d) పాట్నా
Q5. తెలంగాణ ప్రజా సమితిని ఏ సంవత్సరంలో ఏర్పాటు చేసారు?
(a) 1968
(b) 1969
(c) 1967
(d) 1970
Q6. పప్పు ధాన్యాల ఉత్పత్తిలో తెలంగాణా రాష్ట్రం జాతీయ స్థాయిలో ఎన్నవ స్థానంలో ఉన్నది?
(a) 1 వ స్థానం
(b) 2 వ స్థానం
(c) 3 వ స్థానం
(d) 4 వ స్థానం
Q7. తెలంగాణా రాష్ట్రంలో ఎన్ని సంవత్సరాల వయస్సు మొదలుకొని వృద్దాప్య పించన్లు అందించడం జరుగుతుంది?
(a) 55 సంవత్సరాలు
(b) 58 సంవత్సరాలు
(c) 57 సంవత్సరాలు
(d) 60 సంవత్సరాలు
Q8. హైదరాబాద్ సంస్థానం భారత్లో విలీనమైన సంవత్సరం?
(a) 1948 సెప్టెంబర్ 17
(b) 1949 సెప్టెంబర్ 18
(c) 1947 సెప్టెంబర్ 17
(d) 1947 సెప్టెంబర్ 20
Q9. 2025 -26 తెలంగాణా రాష్ట్ర బడ్జెట్ ఎంత?
(a) రూ. 2,85,756 కోట్లు
(b) రూ. 3.05 లక్షల కోట్ల
(c) రూ.2,24,435 కోట్లు
(d) రూ.2,48,567 కోట్లు
Q10. ఇటివల దేశంలో ట్రాఫిక్ శబ్ద కాలుష్యాన్ని నివారించే క్రమంలో శబ్దాన్ని ఆధారంగా చేసుకొని పని చేసే సాంకేతికతను ఏ రాష్ట్రం అభివృద్ధి చేస్తోంది?
(a) తెలంగాణా
(b) ఆంధ్రప్రదేశ్
(c) మహారాష్ట్ర
(d) ఢిల్లీ
Q11. 2025-26 బడ్జెట్ అంచనాల ప్రకారం, రైతు భరోసా పథకానికి ఎంత డబ్బు ఖర్చు చేయబడింది?
(a) 18,000 కోట్లు
(b) 20,250 కోట్లు
(c) 14,300 కోట్లు
(d) 11,723 కోట్లు
Q12. భారతదేశంలో మొదటిసారిగా రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ కమిషన్ ను ఎవరి నేతృత్వంలో ఏర్పాటు చేశారు?
(a) ఆచార్య జయశంకర్
(b) ప్రొపెసర్ కోదండరాం
(c) ఫజల్ అలీ
(d) మర్రి చెన్నారెడ్డి
Q13. క్రింది వానిలో KCR న్యూట్రిషన్ కిట్లను ఎవరికీ అందజేస్తారు?
(a) పిల్లలకు
(b) వయో వృద్దులకు
(c) బాలింతలకు
(d) బాలికలకు
Q14. ఇటివల దేశంలోనే అతి పెద్ద నీటిపై తేలియాడే సౌర విద్యుత్ కేంద్రాన్ని NTPC ఎక్కడ ఏర్పాటు చేయనున్నది?
(a) గుంటూరు
(b) రామగుండం
(c) జగిత్యాల
(d) ప్రకాశం
Q15. ఇంటి స్థలం కలిగిఉన్న లబ్దిదారులకు భవన నిర్మాణం కోసం ఎంత మొత్తం సొమ్మును తెలంగాణా ప్రభుత్వం లోను రూపంలో ఇవ్వనున్నది?
(a) రూ.2,50,000/-
(b) రూ.3,00,000/-
(c) రూ.5,00,000/-
(d) రూ.1,50,000/-
Q16. ప్రత్యేక తెలంగాణ సమస్యను పరిష్కరించడం లో భాగంగా కేంద్ర ప్రభుత్వం శ్రీ కృష్ణ కమిటీని ఏర్పాటు చేసిన తేది?
(a) 2010 ఫిబ్రవరి 3
(b) 2011 ఫిబ్రవరి 3
(c) 2010 ఫిబ్రవరి 5
(d) పైవేవి కావు
Q17. తెలంగాణా రాష్ట్రంలో కొత్తగా ఎన్ని జిల్లాల్లో వైద్య కళాశాలలను ఏర్పాటు చేయనున్నారు?
(a) 8
(b) 9
(c) 10
(d) 33
Q18. తెలంగాణా రాష్ట్ర శాశన మండలి చైర్మన్ ఎవరు?
(a) గుంగుల కమలాకర్
(b) సత్యవతి రాథోడ్
(c) అజయ్ కుమార్
(d) గుత్తా సుఖేందర్ రెడ్డి
Q19. ఫార్ములా వన్ తరహాలో, ఫార్ములా ఈ-రేస్ ను ప్రపంచవ్యాప్తంగా మొదటిసారి ఎక్కడ నిర్వహించనున్నారు?
(a) ముంబై
(b) బెంగుళూరు
(c) హైదరాబాద్
(d) సికింద్రాబాద్
Q20. తెలంగాణ ప్రాంతంలో ముల్కీ ఉద్యమం ప్రారంభమైన తేదీ?
(a) 1952 ఆగష్టు 5
(b) 1969 ఆగష్టు 5
(c) 1953 ఆగష్టు 10
(d) పైనవేవి కావు
Q21. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం?
(a) 2014 మార్చి 2
(b) 2014 జూలై 30
(c) 2014 ఫిబ్రవరి 18
(d) 2014 జూన్ 2
Q22. తెలంగాణ భౌగోళిక విస్తీర్ణం ఎంత ?
(a) 1,14,840 చ.కి.మీ.
(b) 1,12,007 చ.కి.మీ
(c) 1,15,840 చ.కి.మీ
(d) 1,14,750 చ.కి.మీ
Q23. గొండ్వానా శిలలు తెలంగాణ లో ఏ నది పరీవాహక ప్రాంతంలో ఉన్నాయి?
(a) గోదావరి
(b) కృష్ణా
(c) మంజీర
(d) కావేరి
Q24. తెలంగాణ లో తూర్పు కనుమలలో ఎతైన కొండ ఏది?
(a) లక్ష్మి దేవి పల్లి కొండ
(b) అజంతా శ్రేణి
(c) గోతి కొండ
(d) సిర్పూర్ కొండలు
Q25. గోదావరి నది ఎన్ని పాయలుగా చీలి బంగాళాఖాతం లో కలుస్తుంది?
(a) 7
(b) 5
(c) 4
(d) 9
Q26.దక్షిణ భారత దేశాన్ని పరిపాలించిన తొలి ప్రధాన రాజవంశం?
(a) శాతవాహనులు
(b) కాకతీయులు
(c) మొఘలులు
(d) చోళులు
Q27. ఏ పురాణం లో శాతవాహనుల చరిత్ర గురించి వివరించబడింది?
(a) ఆదిపురాణం
(b) మత్స్యపురాణం
(c) బ్రహ్మ పురాణం
(d) పైవేవి కావు
Q28.కింది వాటిలో ఏది సరైనది?
(a) నానాఘాట్ శాసనం – క్షాత్రప రుద్రధాముడు
(b) జునాఘడ్,గిర్నార్ శాసనం – ఖారవేలుడు
(c) నాసిక్ శాసనం – గౌతమిబాలశ్రీ
(d) హాథిగుంఫా శాసనం – నాగానిక
Q29. వేములవాడ చాళుక్యుల నిజమైన స్థాపకుడు ఎవరు?
(a) వినయాదిత్య యుద్ధమల్లుడు
(b) పృధు విక్రముడు
(c) పృథ్వీపతి
(d) మొదటి అరికేసరి
Q30. కుతుబ్షాహీలు ఏ మత శాఖకు చెందినవారు?
(a) షేక్
(b) సున్నీ
(c) షియా
(d) సయ్యద్
Solutions
S1. Ans.(d)
Sol. దక్షిణ భారతదేశంలో మొట్టమొదటి అమూల్ డైరీ ప్లాంట్ తెలంగాణ రాష్ట్రంలో ఏర్పాటు చేయబడింది.
S2. Ans.(d)
Sol. తెలంగాణాలో పరిశ్రమలు, ఫార్మా, సాఫ్ట్వేర్, కుటీర పరిశ్రమలు తదితర ఉపాధి వనరులు అధికంగా ఉండటంతో తలసరి ఆదాయం/పెర్ క్యాపిటా (రూ.6,58,757)లో రంగారెడ్డి జిల్లా మొదటి స్థానంలో, తరువాతి స్థానంలో హైదరాబాద్ నిలిచాయి. జాతీయ తలసరి ఆదాయం రూ.1,26,757తో పోల్చితే రాష్ట్రంలోని అన్ని జిల్లాలు ముందున్నాయి. జిల్లాల్లోని తలసరి ఆదాయాన్ని పోల్చితే చివరి స్థానంలో వికారాబాద్ నిలిచింది.
S3. Ans.(b)
Sol. కేంద్రం ఇటివల విడుదల చేసిన ఆరోగ్య సూచిలో తెలంగాణా రాష్ట్రం 3 వ స్థానంలో ఉన్నది. కేరళ రాష్ట్రం మొదటి స్థానంలో, తమిళనాడు రెండవ స్థానం మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం 4 వ స్థానంలో కొనసాగుతున్నాయి.
S4. Ans.(a)
Sol. కేంద్రం ఇప్పటి వరకు మొత్తం 20 సైన్స్ సిటీలను ఏర్పాటు చేసింది. కాగా, తెలంగాణలో సైన్స్ సిటీ ఏర్పాటుకు ప్రతిపాదనలు పంపారు. ఇందుకు హైదరాబాద్ను ఎంపిక చేశారు. కానీ ఇంతవరకు ఆమోదం పొందలేదు.
S5. Ans.(b)
Sol. 1969 లో తెలంగాణ ప్రజా సమితిని ఏర్పాటు చేసారు.
S6. Ans.(d)
Sol. పప్పు ధాన్యాల ఉత్పత్తిలో 2018-20 కాలానికి తెలంగాణా రాష్ట్రం 4 వ స్థానంలో ఉన్నది. ఇదిలా ఉండగా జాతీయ స్థాయిలో వృద్ది 4.3 శాతం ఉండగా అది రాష్ట్రంలో 20.49 శాతంగా నమోదు అయ్యింది.
S7. Ans.(c)
Sol. తెలంగాణా రాష్ట్రంలో 57 సంవత్సరాల వయస్సు మొదలుకొని వృద్దాప్య పించన్లు అందించడం జరుగుతుంది.
S8. Ans.(a)
Sol. 1948 సెప్టెంబర్ 17 లో హైదరాబాద్ సంస్థానం భారత్లో విలీనమైనది.
S9. Ans.(b)
Sol. 3.05 లక్షల కోట్ల రూపాయల వ్యయంతో తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ను ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క అసెంబ్లీలో ప్రవేశపెట్టారు.
S10. Ans.(a)
Sol. ట్రాఫిక్ శబ్ద కాలుష్యాన్ని నివారించే క్రమంలో శబ్దాన్ని ఆధారంగా చేసుకొని పని చేసే సాంకేతికతను తెలంగాణా రాష్ట్రం అభివృద్ధి చేస్తోంది, దీనికి సంబంధించి సాంకేతికతను మొదటిగా హైదరాబాద్ నగరంలో ప్రారంభించనున్నారు. సిగ్నల్ కూడళ్ళ వద్ద ఎక్కువ శబ్దాన్ని ఉత్పత్తి చేసే వాహనాలను కనిపెట్టి వాటిని ఫోటో తీయడం ద్వారా జరిమానా విధించడం జరుగుతుంది.
S11. Ans.(a)
Sol. 2025–26 తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ ప్రకారం, రైతు భరోసా పథకానికి ₹18,000 కోట్లు కేటాయించారు. ఈ చొరవ రైతులకు ప్రత్యక్ష ఆర్థిక సహాయం అందిస్తుంది, పెట్టుబడి మద్దతుగా ఏటా ఎకరానికి ₹12,000 అందిస్తుంది. అదనంగా, ప్రభుత్వం సన్న రకం వరి సేకరణ కోసం క్వింటాలుకు ₹500 బోనస్ను అందిస్తోంది.
S12. Ans.(C)
Sol. భారతదేశంలో మొదటిసారిగా రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ కమిషన్ ను 1953 డిసెంబర్ 22 న ‘ఫజల్ అలీ’ నేతృత్వంలో ఏర్పాటు చేశారు
S13. Ans.(c)
Sol. బాలింతలకు కేసీఆర్ పౌష్టికాహార కిట్లను అందజేస్తున్నారు. రాష్ట్రంలో ప్రసవానంతరం రక్తహీనత ఉన్నట్లు గుర్తించారు.
S14. Ans.(b)
Sol. ఇటివల దేశంలోనే అతి పెద్ద నీటిపై తేలియాడే సౌర విద్యుత్ కేంద్రాన్ని NTPC తెలంగాణా రాష్ట్రంలో రామగుండంలో 400 ఎకరాల రిజర్వాయర్ నందు ఏర్పాటు చేయనున్నారు. దీని ద్వారా 100 మెగా వాట్ల విద్యుత్ ఉత్పత్తి చేయనున్నారు.
S15. Ans.(c)
Sol. ఇందిరమ్మ గృహనిర్మాణ పథకం 2025 కింద, తెలంగాణ ప్రభుత్వం భూమిని కలిగి ఉన్న లబ్ధిదారులకు ఇళ్ళు నిర్మించుకోవడానికి ఆర్థిక సహాయం అందిస్తుంది. అర్హత కలిగిన లబ్ధిదారులకు ఒక్కొక్కరికి ₹5 లక్షలు, షెడ్యూల్డ్ కులాలు (SC) మరియు షెడ్యూల్డ్ తెగలు (ST) కు చెందిన వారికి ₹6 లక్షలు మంజూరు చేయబడతాయి.
S16. Ans.(a)
Sol. ప్రత్యేక తెలంగాణ సమస్యను పరిష్కరించడం లో భాగంగా కేంద్ర ప్రభుత్వం శ్రీ కృష్ణ కమిటీని 2010 ఫిబ్రవరి 3 న ఏర్పాటు చేశారు. శ్రీ కృష్ణ కమిటీ తన నివేదికను కేంద్ర హోం శాఖకు సమర్పించిన తేది 2010 డిసెంబర్ 30.
S17. Ans.(a)
Sol. తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా 8 జిల్లాల్లో మెడికల్ కాలేజీలు ఏర్పాటు కానున్నాయి. ములుగు, నర్సంపేట, జోగుళాంబ గద్వాల్, నారాయణపేట, యాదాద్రి భోంగీర్, మెదక్, మహేశ్వరం, కుత్బుల్లాపూర్లో కొత్తగా అనుమతి పొందిన మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేయనున్నారు.
S18. Ans.(d)
Sol. ఇటివల తెలంగాణా శాశన మండలి చైర్మన్ గా గుత్తా సుఖేందర్ రెడ్డి ఎన్నికయ్యారు.
S19. Ans.(c)
Sol. ఫార్ములా వన్ తరహాలో, ఫార్ములా ఈ-రేస్ ను ప్రపంచవ్యాప్తంగా మొదటిసారి హైదరాబాద్ నగరంలో నిర్వహించనున్నారు, దీనిలో కేవలం ఎలక్ట్రిక్ కార్లను మాత్రమే వాడనున్నారు . ఈ పోటీలు నవంబర్ 2022 నుండి ఫిబ్రవరి 2023 వరకు జరుగుతాయి.
S20. Ans.(a)
Sol. తెలంగాణ ప్రాంతంలో 1952 ఆగష్టు 5 న ముల్కీ ఉద్యమం ప్రారంభమైనది.
S21. Ans.(d)
Sol. 2014 జూన్ 2 న తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవంగా జరుపుకుంటారు.
S22. Ans.(a)
Sol. తెలంగాణ భౌగోళిక విస్తీర్ణం 1,14,840 చ.కి.మీ. తెలంగాణ దక్కన్ పీఠభూమిలో భాగం. ఈ పీఠభూమి సముద్ర మాట్టానికి సగటున 480 – 600మీటర్లు ఎత్తున ఉంది.
S23. Ans.(a)
Sol. గొండ్వానా శిలలు తెలంగాణ లో గోదావరి నది పరీవాహక ప్రాంతంలో ఉన్నాయి. నిర్మల్, మంచిర్యాల , జగిత్యాల, పెద్దపల్లి , జయశంకర్-భూపాలపల్లి, భద్రాద్రి-కొత్తగూడెం జిల్లాలు గోదావరి నది లోయలో భాగంగా ఉండటం వలన పురాతన గొండ్వానా శిలలతో బొగ్గు నిక్షేపాలు ఏర్పడి ఉన్నాయి.
S24. Ans.(a)
Sol. దక్కన్ పీఠభూమి తూర్పున గల తూర్పు కనుమలు, దక్షిణాన గల పడమటి కనుమలు రెండూ తెలంగాణలోకి ప్రవేశించాయి. తూర్పు కనుమలు నిర్మాణం దృష్ట్యా తూర్పు కొండలుగా మహబూబ్ నగర్ నుంచి తెలంగాణలోకి విస్తరించాయి. తెలంగాణ లో తూర్పు కనుమలలో ఎతైన కొండ – లక్ష్మి దేవి పల్లి కొండ. ఇది సిద్దిపేట జిల్లాలో ఉంది. తెలంగాణ లో తూర్పు కనుమలు ఏక శ్రేణిగా ఉండకుండా గుట్టలు, కొండలు గా ఉండి ప్రాంతీయ పేర్లతో పిలువబడుతున్నాయి
S25. Ans.(b).
Sol. గోదావరి నది ధవళేశ్వరం వద్ద 5 ప్రధాన పాయలుగా చీలి ఒక్కో పాయ ఒక్కో ప్రాంతం వద్ద బంగాళాఖాతంలో కలుస్తుంది.
పాయలు:
- గౌతమి – ఉత్తర శాక యానం వద్ద
- వశిష్ట – మధ్య శాక అంతర్వేది వద్ద
- వైనతేయ – దక్షిణ శాక కొమరగిరి పట్నం వద్ద
- తుల్య
- భారద్వాజ – బెండమూరులంక వద్ద బంగాళాఖాతం లో కలుస్తాయి.
తుల్య, భారద్వాజ పాయల మధ్యలో కౌశిక, ఆశ్రేయ అనే పాయలు చేరి ఒకే పాయగా ప్రవహిస్తూ బెండమూరులంక వద్ద బంగాళాఖాతం లో కలుస్తుంది.
S26. Ans.(a)
Sol. దక్షిణ భారత దేశాన్ని పరిపాలించిన తొలి ప్రధాన రాజవంశం శాతవాహనులు. సుమారు రెండున్నర శతాబ్దాల కాలంలో దక్షిణ భారత దేశంలో సామాజిక ఆర్థిక సాంస్కృతిక రంగాల్లో ప్రగతిశీల మార్పులు మరియు సాహిత్య వాస్తు శిల్పకళలలో గొప్ప ఆదరణ వీరికాలంలో చోటుచేసుకున్నాయి.
S27. Ans.(b)
Sol. అష్టాదశ పురాణాలలో పదహారో పురాణం మత్స్య పురాణం. ఈ పురాణంలో 289 అధ్యాయాలు, పద్నాలుగు వేల శ్లోకాలున్నాయి, ఇది ప్రాచీనమైనది. వేద వాఙ్మయంలో దాగిన సృష్టితత్త్వాన్ని కథారూపంగా వివరించడానికి అష్టాదశ పురణాలను వ్యాసమహర్షి రచించాడు. ఈ పురాణంలో శాతవాహనుల చరిత్ర గురించి వివరించబడింది.
S28. Ans.(c)
Sol. నాసిక్ శాసనం వేయించినది గౌతమిపుత్ర శాతకర్ణి తల్లి గౌతమిబాలశ్రీ, నానాఘాట్ శాసనం-మొదటి శాతకర్ణి భార్య నాగానిక,జునాఘడ్ & గిర్నార్ శాసనం-క్షాత్రప రుద్రధాముడు,హాథిగుంఫా శాసనం-ఖారవేలుడు.
S29. Ans.(a)
Sol. వినయాదిత్య యుద్ధమల్లుడు (క్రీ.శ.750-775) వేములవాడ చాళుక్యుల నిజమైన స్థాపకుడు. ఇతని రాజధాని బోధన్. గోదావరి నదికి దక్షిణాన గల మంజీరా నది నుండి మహాకాళేశ్వర పర్వతం వరకు వ్యాపించి ఉన్న భాగమే ‘పోదనపాడు’. దీనినే సపదాలక్షదేశం అంటారు. ఇదే నేటి వేములవాడ చాళుక్య రాజ్యం. ఇతను రాష్ట్రకూట రాజ్యస్థాపకుడైన దంతిదుర్గుడు యొక్క సేనాధిపతి, తరువాత సామంత రాజు అయ్యాడు.
S30. Ans.(c)
Sol. కుతుబ్షాహీలు పర్షియా నుంచి వచ్చారు. వీరు షియా తెగకు చెందినవారు. తమ మత సంప్రదాయం ప్రకారం పరమత సహనం పాటించారు. కుతుబ్షాహీలు ప్రజల మత విశ్వసాలను, ఆచార వ్యవహారాలను గౌరవించేవారు.
Telangana High Court Quick Revision Practice Set- 06, Download PDF