Telugu govt jobs   »   Current Affairs   »   Two new Mandals are going to...

Two new Mandals are going to be formed in Telangana | తెలంగాణలో రెండు కొత్త మండలాలు ఏర్పాటు కానున్నాయి

Two new Mandals are going to be formed in Telangana | తెలంగాణలో రెండు కొత్త మండలాలు ఏర్పాటు కానున్నాయి

ప్రభుత్వ నిర్ణయంలో భాగంగా తెలంగాణలో రెండు మండలాలను ఏర్పాటు చేయనున్నారు. కొత్తగా ప్రణాళిక చేయబడిన మండలాల్లో గద్వాల్ జిల్లాలోని ఎర్రవల్లి మరియు కామారెడ్డి జిల్లాలోని మహమ్మద్‌నగర్ ఉన్నాయి. ఇంకా కీసర మండల పరిధిలోని బార్సిగూడను గ్రామ పంచాయతీగా ఏర్పాటు చేయనున్నారు. ఈ మేరకు ప్రభుత్వం వేర్వేరు నోటిఫికేషన్లను విడుదల చేసింది. తొలిదశలో జోగులాంబ గద్వాల జిల్లాలోని ఎర్రవల్లిని మండలంగా పేర్కొంటూ ప్రభుత్వం ప్రాథమిక నోటిఫికేషన్‌ను విడుదల చేసి ప్రజల అభిప్రాయాలను సేకరించింది. తాజాగా దీనికి సంబంధించి తుది నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. ఇక కామారెడ్డి జిల్లాలోని మహ్మద్‌నగర్‌ను నూతన మండలంగా, మేడ్చల్‌ మల్కాజ్‌గిరి జిల్లా బొగారం గ్రామ పరిధిలో ఉన్న బార్సిగూడను నూతన గ్రామపంచాయతీగా ఏర్పాటుచేస్తూ ప్రాథమిక నోటిఫికేషన్ లను విడుదల చేసింది. వీటిపై ఏమైనా అభ్యంతరాలు ఉంటే తెలపాలని నోటిఫికేషన్ లో తెలిపింది. ఈ పరిణామాలపై ఆయా మండల వాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Telangana Mega Pack (Validity 12 Months)

మరింత చదవండి:
తాజా ఉద్యోగ ప్రకటనలు  ఇక్కడ క్లిక్ చేయండి
ఉచిత స్టడీ మెటీరియల్ (APPSC, TSPSC) ఇక్కడ క్లిక్ చేయండి
ఉచిత మాక్ టెస్టులు  ఇక్కడ క్లిక్ చేయండి

***************************************************************************

Sharing is caring!

FAQs

తెలంగాణాలో మండలం అంటే ఏమిటి?

మండల్ అంటే తెలంగాణ మునిసిపాలిటీల చట్టం, 1965 మరియు మునిసిపల్ కార్పొరేషన్‌ల పరిధిలోకి వచ్చే ప్రాంతాలను మినహాయించి, తెలంగాణ జిల్లాల (ఫార్మేషన్) యాక్ట్, 1974లోని సెక్షన్ 3 కింద మండలంగా ప్రభుత్వం నోటిఫికేషన్ ద్వారా ప్రకటించే విధంగా ఒక జిల్లాలో ఉన్న ప్రాంతం.