Telugu govt jobs   »   Article   »   విజయానికి ప్రతీకగా నిలిచే పండుగ విజయదశమి

విజయానికి ప్రతీకగా నిలిచే పండుగ విజయదశమి

విజయానికి ప్రతీకగా నిలిచే పండుగ విజయదశమి

విజయదశమి తొమ్మిది రోజులు పాటు అమ్మవారుని ఆరాధించి ఎంతో గొప్పగా నిర్వహించే పండుగ. దీనిని వివిధ రాష్ట్రాలలో వివిధ పేర్లతో కొలుస్తారు, ఆంధ్రాలో కనకదుర్గ, తెలంగాణ లో బతుకమ్మ, బెంగాల్ లో దుర్గామాత, కర్ణాటకలో చాముండి అని వివిధ రూపాలలో ప్రజలు పూజిస్తారు. దసరా తొమ్మిది రోజులు కూడా తొమ్మిది ఆకారాలు లేదా అవతారాలలో అలంకరిస్తారు. ఈ పండగలో మొదటి మూడు రోజులు అమ్మవారిని పార్వతి దేవిగా ఆ తర్వాత మూడు రోజులు లక్ష్మీ దేవిగా చివరి మూడు రోజులు సరస్వతి దేవిలా అలంకరించి పూజలు నిర్వహిస్తారు ఇలా వివిధ రూపాలలో దేవతలను దసరా ఉత్సవాల సందర్భంగా ఆ దేవి లేదా ఆదిశక్తిని కొలుస్తారు. పడవ రోజున ఆంధ్రాలో విజయదశమిగా సంబరాలు చేసుకుంటారు, తెలంగాణలో బతుకమ్మ సంబరాలు నిర్వహిస్తారు.

TSGENCO AE Online Test Series and MCQs Live Batch, Enroll Now_40.1

APPSC/TSPSC Sure shot Selection Group

దసరా పండుగ

దసరా అనేది ప్రతీ సంవత్సరం ఆశ్వయుజ శుక్ల పాడ్యమితో ప్రారంభమైన నవమి నాడు అనగా తొమ్మిది రోజులు నవరాత్రి సంబరాల తర్వాత విజయదశమి నాడు ముగుస్తుంది. దసరా నాడు వివిధ ప్రాంతాలలో వివిధ పురాణ ప్రాముఖ్యత ఉంది వాటిలో ఒకటి, కృతయుగమున సుకేతనుడు అనే రాజు శాపం వలన రాజ్యభ్రష్టుడై భార్యతో పాటు అడవుల వెంబడి తిరుగుతూ కష్టాలను అనుభవిస్తాడు. ఒకనాడు అంగీరసుడు అనే ఋషి దయవల్ల అతనికి నవరాత్రి గురించి తెలుస్తుంది. ఆతర్వాత అతను మహర్షి చెప్పిన విధంగా పూజ చేసి తన ఐశ్వర్యాన్ని రాజ్యాన్ని తిరిగి పొందుతాడు. ఈ ఇతివృత్తం వలన ప్రజలు ఆ అమ్మవారుని  వివిధ రూపాలలో దుర్గ, లక్ష్మి, సరస్వతిలా కొలిచి పూజించడం మొదలు పెట్టారు. ఒక్కవదేవతకు మూడేసి రోజులు చొప్పున తొమ్మిది రోజులు పూజలు నిర్వహించి ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. ఈ తొమ్మిది రోజులు ఆ దేవతలను పూజించడం కూడరాకపోయిన ఆఖరి రోజైన నవమి నాడు విద్యాపీఠమున పుస్తకాలను పెట్టి దేవీత్రయమును కల్పవిధిప్రకారము పూజిస్తారు. ఆ చివరి రోజున మహానవమి అని ఆ రోజున పూజించడం వలన సకల ఐశ్వర్యాలు లభిస్తాయి అని ప్రజల నమ్మకం. తొమ్మిది రోజుల తర్వాత దశమి తిథివల్ల విజయదశమి అని పేరు వచ్చింది.

మహిషాసురుడు, శక్తివంతమైన రాక్షసుడు. బ్రహ్మదేవుడి వలన మరణం లేని వరం పొంది దేవతలను ఓడించి ఇంద్రుడి సింహాసనాన్ని అధిష్టించాడు. మహిషాసురుని చేష్టల వలన దేవతలు కలత చెందారు అప్పుడు వారు త్రిమూర్తులను అనగా బ్రహ్మ, విష్ణు మరియు శివుడులను సహాయం కోరారు. మహిషాసురుడిని ఓడించడానికి త్రిమూర్తులు తమ శక్తులతో ఒక దేవతను సృష్టించారు. మహిషాసురమర్దినిగా పేరుగాంచిన ఈ అమ్మవారు శివుని తేజస్సుతో ముఖముగాను, విష్ణువు తేజస్సును బాహువులుగాను, బ్రహ్మ తేజస్సును పాదములుగాను ధరించి మంగళమూర్తిగా అవతరించింది. ఆమెకు 18 చేతులు ఉన్నాయి మరియు అన్ని దేవతల ఆయుధాలను కలిగి ఉంది. మహిషాసురమర్దిని మహిషాసురుని సైన్యంతో భీకర యుద్ధం చేసి మహిషాసురుని తరపున పోరాడుతున్న రాక్షసులందరినీ సంహరించింది. చివరకు మహిషాసురుడిని స్వయంగా ఎదుర్కొని భీకర యుద్దంలో ఆమె తన త్రిశూలంతో మహిషాసురుడిని సంహరించింది.

మహిషాసురుని మరణానికి దేవతలు, ప్రజలు సంతోషించారు. చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా ఆయన మరణించిన రోజును దసరాగా జరుపుకున్నారు. దసరా భారతదేశం అంతటా జరుపుకునే పండుగ. ఇది చెడుపై విజయం సాధించే మంచి శక్తిని గుర్తు చేస్తుంది. ప్రతికూల పరిస్థితుల్లో కూడా మనం ఎప్పుడూ ఆశను వదులుకోకూడదని కూడా ఇది గుర్తు చేస్తుంది.

నవరాత్రి అవతారాలు

నవరాత్రి ఉత్సవాల లో ఆ శక్తి మాతను ఒక్కోరోజున ఒక్కో దేవి అలంకారంలో అలంకరించి పూజిస్తారు ఈ అలంకారాలు ఒక్కోప్రాంతంలో ఒక్కోలాగా ఉంటాయి.

  1. మొదటి రోజు శైల పుత్రి
  2. రెండవ రోజున బ్రహ్మచారిణి
  3. మూడవ నాడు చంద్రఘంట
  4. నాల్గవ రోజున కూష్మాండ
  5. అయిదవ రోజున స్కంధమాత
  6. ఆరవ రోజున కాత్యాయినీ
  7. ఏడవరోజున కాళరాత్రి
  8. ఎనిమిదవ రోజున మహాగౌరి
  9. తొమ్మిదవ రోజున సిద్ధిధాత్రిదేవి

ఈ నవరాత్రి అవతారాలలో చివరి రోజున అమ్మవారిని కొన్ని ప్రాంతాలలో మహాలక్ష్మి, పార్వతి, కనకదుర్గ, గాయత్రి, మహిషాసుర మర్ధిని, అన్నపూర్ణ ఇలా వివిధ అవతారాలలో కొలుస్తారు.

దసరా – ఉత్సవాలలో పదవ రోజు

నవరాత్రులు చెడు నిర్మూలన మరియు జీవితంలోని అన్ని అంశాలకు కృతజ్ఞతా భావాన్ని సూచిస్తాయి. తొమ్మిది రోజులు మూడు గుణాల ఆధారంగా వర్గీకరించబడ్డాయి: తమస్సు, రజస్సు మరియు సత్వ. ప్రారంభ మూడు రోజులు దుర్గ మరియు కాళి వంటి తీవ్రమైన దేవతలచే మూర్తీభవించిన తామసిక లక్షణాలను సూచిస్తాయి. తరువాతి మూడు రోజులు సంపద, శ్రేయస్సు మరియు వాహనాలతో సంబంధం ఉన్న సున్నితమైన దేవత అయిన లక్ష్మిని గౌరవిస్తారు. చివరి మూడు రోజులు సరస్వతికి అంకితం చేయబడ్డాయి, ఇది జ్ఞానం మరియు జ్ఞానోదయానికి ప్రతీక.

చరిత్ర లో దసరా పండుగ

1757లో జరిగిన ప్లాసీ యుద్ధం, బెంగాల్ నవాబ్ సిరాజుద్దౌలాపై ఈస్టిండియా కంపెనీ విజయం సాధించి, వారికి బెంగాల్‌పై నియంత్రణను కల్పించింది. ఈ విజయోత్సవ వేడుకలు, దుర్గాదేవి చుట్టూ కేంద్రీకృతమై, చివరికి జాతీయ ఉద్యమానికి ఆజ్యం పోశాయి. ఒకప్పుడు ఇళ్లకే పరిమితమైన దసరా నవరాత్రులు సామాజిక కార్యక్రమంగా మారిపోయాయి. సంపన్న జమీందార్లు ఈస్టిండియా కంపెనీచే ప్రోత్సహించబడిన ఆధిపత్యం మరియు ప్రభావాన్ని చాటుకోవడానికి ఈ పండుగలను ఉపయోగించారు. మొదట్లో జమీందార్ల నేతృత్వంలో జరిగిన దుర్గాపూజ ఉద్యమం ప్రజా ఉద్యమంగా రూపాంతరం చెందింది.

APPSC GROUP-2 2023 Prelims and Mains Chapter wise and Subject Wise Practice Tests | Online Test Series in Telugu and English By Adda247

మరింత చదవండి
తాజా ఉద్యోగ ప్రకటనలు ఇక్కడ క్లిక్ చేయండి
ఉచిత స్టడీ మెటీరియల్ (APPSC, TSPSC) ఇక్కడ క్లిక్ చేయండి
ఉచిత మాక్ టెస్టులు ఇక్కడ క్లిక్ చేయండి
Adda247 తెలుగు APP ఇక్కడ క్లిక్ చేయండి

Sharing is caring!