Telugu govt jobs   »   Current Affairs   »   మహిళలకు YSR చేయూత పధకం

మహిళలకు YSR చేయూత పధకం

మహిళలకు YSR చేయూత పధకం

వైఎస్‌ఆర్‌ చేయూత పథకం ద్వారా ఇప్పటికే 13 లక్షల మంది మహిళలకు శాశ్వత జీవనోపాధి కల్పించామని, వారి కుటుంబాలకు నెలవారీ స్థిరమైన ఆదాయం వచ్చేలా చూస్తామని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రకటించారు. వైఎస్సార్ చేయూత ద్వారా ఏటా రూ.18,750 చొప్పున నాలుగేళ్లలో మొత్తం రూ.75 వేలు ఇవ్వనుండగా ఇప్పటివరకు మూడు విడతల్లో లబ్ధిదారులకు రూ.14,129.11 కోట్లు అందచేసినట్లు చెప్పారు

జూలై 31న తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖ, స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్‌ ఆధ్వర్యంలో గ్రామీణ ప్రాంతాల్లో స్వచ్ఛత కార్యక్రమాల అమలు తీరును సీఎం జగన్‌ సమీక్షించారు. ఈ సమీక్షలో, ఆదాయ మార్గాలను అభివృద్ధి చేయడానికి మరియు స్వయం ఉపాధి అవకాశాలను సృష్టించడానికి ప్రభుత్వం అందించే ఆర్థిక సహాయాన్ని మహిళలకు అందించడానికి ప్రత్యేక చర్యలు తీసుకోవాలని ఆయన అధికారులను ఆదేశించారు. చేయూత కార్యక్రమంలో స్వయం ఉపాధిని పెద్ద ఎత్తున ప్రోత్సహించాలని సూచించారు.

లబ్ధిదారులకు గరిష్ట ప్రయోజనాలు అందేలా చూడాలని, మొదటి విడత డబ్బు అందగానే మహిళలను స్వయం ఉపాధి కార్యక్రమాలకు అనుసంధానం చేయాలని సీఎం జగన్ సూచించారు. అవసరమైన వారికి అదనపు బ్యాంకు రుణాలు అందించడం ద్వారా స్వయం ఉపాధి అవకాశాలను పెంచే మార్గాలను అన్వేషించాలని ఆయన అధికారులను కోరారు. స్వయం ఉపాధి పొందుతున్న మహిళలకు జగనన్న తోడు పథకం ప్రయోజనాలను కూడా వర్తింప చేయాలని సూచించారు.

పొదుపు సంఘాల మహిళలు ఉమ్మడిగా నెలకొల్పిన మహిళా మార్టులు సమర్థంగా పని చేస్తున్నాయని, ఇప్పటివరకు 36 మహిళా మార్టుల ద్వారా రూ.32.44 కోట్ల మేర వ్యాపారం జరిగినట్లు అధికారులు సీఎం జగన్ దృష్టికి తెచ్చారు. గ్రామీణ ప్రాంతాల్లో ఒక్కో మహిళా మార్టులో సగటున రోజుకు రూ. 20.62 లక్షల వ్యాపారం జరిగిందని వివరించారు.

APPSC Group-1 & 2 Complete Foundation Batch | 360 Degrees Preparation Kit | Online Live Classes by Adda 247

మరింత చదవండి:
తాజా ఉద్యోగ ప్రకటనలు  ఇక్కడ క్లిక్ చేయండి
ఉచిత స్టడీ మెటీరియల్ (APPSC, TSPSC) ఇక్కడ క్లిక్ చేయండి
ఉచిత మాక్ టెస్టులు  ఇక్కడ క్లిక్ చేయండి

***************************************************************************

Sharing is caring!

FAQs

చేయూతలో సంవత్సరానికి ఎంత మొత్తం ఇస్తారు?

ఆంధ్రప్రదేశ్ యొక్క YSR చేయూత పథకం మహిళ లబ్ధిదారునికి ₹75000 విలువైన ప్రయోజనాలను అందిస్తుంది. యాన్యుటీ ప్రతి సంవత్సరం ₹18750 నాలుగు సమాన వాయిదాలలో పంపిణీ చేయబడుతుంది. గ్రహీత పార్టీ లెడ్జర్‌లో మొత్తం నమోదు చేయబడుతుంది.